ఏపీలో ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్
NEWS Jul 16,2025 01:08 pm
ఏపీలో ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేయాలని కోరారు సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి మన్సూఖ్ తో భేటీ అయ్యారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు తీసుకున్నామన్నారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్రానికి థ్యాంక్స్ చెప్పారు.