రవితేజ తండ్రి మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి
NEWS Jul 16,2025 08:24 am
హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మరణవార్త విని చాలా బాధ పడ్డానని పేర్కొన్నారు. తనను ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య షూటింగ్ సెట్ లో కలిశానని గుర్తు చేసుకున్నారు. ఈ కష్ట సమయంలో రవితేజ కుటుంబానికి సానుభూతి తెలియ చేశారు. రాజ గోపాల్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.