దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం
NEWS Jul 16,2025 07:32 am
గుడివాడలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నానితో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పలు అంశాలపై ఈ ఇద్దరు నేతలు చర్చించారు. జడ్పీ చైర్మన్, బీసీ మహిళ ఉప్పాల హారికాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు కటారి ఈశ్వర్ కుమార్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ఎవరు దాడులకు పాల్పడినా చూస్తూ ఊరుకోమని , అడ్డుకుని తీరుతామని వార్నింగ్ ఇచ్చారు.