ఎమ్మెల్యే రాజా సింగ్ పై మాధవీలత ఫైర్
NEWS Jul 15,2025 08:29 pm
గోషామహల్లో రాజాసింగ్ కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత. మహిళలను, ఇతర మతాలను దూషించడమే హిందూ తత్వం కాదన్నారు. కార్పొరేటర్ ను తీసుకొచ్చి ఎమ్మెల్యేను చేసిన బీజేపీని తిడితే ఎలా అని ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థిగా మగాళ్లు దొరకలేదా అంటూ తనను ఉద్దేశించి దూషించారని, ఆయన వల్ల పార్టీకి నష్టమే తప్పా ఎలాంటి లాభం లేదన్నారు.