అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం
NEWS Jul 16,2025 06:31 am
గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని ఇంచార్జి డిపిఓ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. నారాయణపేట డిఎంహెచ్వో కాన్ఫరెన్స్ హాల్లో భారత ప్రభుత్వం పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం సిబ్బంది, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, గ్రామ సభలపై ఎంపిక చేసిన కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి దక్కేలా చూడాలని చెప్పారు.