భూమి పైకి క్షేమంగా చేరుకున్న శుభాంషు శుక్లా
NEWS Jul 15,2025 04:47 pm
అంతరిక్షం నుంచి భూమి పైకి సురక్షితంగా చేరుకున్నారు భారత దేశానికి చెందిన వ్యోమగామి శుభాంషు శుక్లా. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో శాన్ డియాగో తీర ప్రాంతంలో తను క్షేమంగా దిగాడు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. శుక్లా భారత దేశానికి గర్వ కారణంగా నిలిచాడని ప్రశంసించారు.