భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గ్రామానికి చెందిన స్ఫూర్తి ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా బ్యాటరీ సాయంతో నడిచే వాహనాన్ని తయారు చేసింది. ఎన్నో యత్నాలు విఫలమైనా.. పట్టువీడకుండా ఈవీ(EV) వాహనం తయారు చేసి శభాష్ అనిపించుకుంటోంది. ఈ వాహనానికి ‘ఎకో వారియర్’ అని నామకరణ కూడా చేసింది.