హైదరాబాద్ లో రియల్టర్ చందూ నాయక్ కాల్చివేత
NEWS Jul 15,2025 10:34 am
హైదరాబాద్ నగరంలో పట్టపగలు కాల్పుల కలకలం భయాందోళనకు గురి చేసింది. మలక్పేట్ - శాలివాహన నగర్లోని పార్కు వద్ద రియల్టర్ చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భూ తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.