బనకచర్ల ప్రాజెక్టుపై రేపు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ
NEWS Jul 15,2025 10:17 am
గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై CM చంద్రబాబు నాయుడు, తెలంగాణ CM రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ రేపు ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ సమావేశం జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 2:30 గంటలకు జరగనుంది.ఈ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అంశాలతో పాటు ఇతర ఎజెండా పాయింట్లను సమర్పించాలని జలశక్తి శాఖ రెండు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరింది.