చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ టూర్
NEWS Jul 15,2025 07:39 am
రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి అమిత్ షాతో , నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సరస్వత్ , మెట్రో ఎండీతో భేటీ అవుతారు. అనంతరం సంస్మరణ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశం అవుతారు. 16న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయతో , జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చిస్తారు.