కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
NEWS Jul 15,2025 06:48 am
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కనిగిరి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. వారాంతపు సమ్మె సెలవులు అమలు చేయాలని కోరారు. సిఐటియు జిల్లా నాయకులు పిసి కేశవరావు పాల్గొన్నారు.