కనిగిరిలో 'సుపరిపాలనలో తొలి అడుగు'
NEWS Jul 15,2025 06:47 am
కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై క్లస్టర్, యూనిట్, బూత్, కెఎస్ఎస్ విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కనిగిరిలో ఈ ఏడాదిలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్ , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.