విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తాం- మంత్రి
NEWS Jul 15,2025 06:43 am
కనిగిరిలో సబ్ స్టేషన్కు భూమి పూజ చేశారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. గత వైసీపీ ప్రభుత్వం ప్రజా పాలనను విస్మరించి వ్యవస్థలను విచ్ఛిన్నం చేసిందని ఆయన విమర్శించారు. 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చార్జీలు పెంచకుండా విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.