కేరళ సీఎం నివాసానికి బాంబు బెదిరింపు
NEWS Jul 14,2025 03:53 am
కేరళ సీఎం పినరయ్ విజయన్ అధికారిక నివాసంలో బాంబు పేలుళ్లు జరగ బోతున్నాయంటూ ఈ-మెయిల్ కలకలం సృష్టించింది. తంపనూరు పోలీస్ స్టేషన్ కు ఈ మెయిల్ వచ్చింది. దీంతో సీఎం నివాసంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాంబులు లేక పోవడంతో అది ఫేక్ ఈ-మెయిల్ గా నిర్థారించారు. ఎవరు పంపించారనే దానిపై ఆరా తీస్తున్నారు.