సింగపూర్ పర్యటనకు వెళుతున్న సీఎం చంద్రబాబు
NEWS Jul 13,2025 08:17 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ఈ నెల 26న సింగపూర్ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 30 వరకు ఆయన పర్యటన సాగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, నారాయణ, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.