దొంగతనాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన
NEWS Jul 13,2025 11:03 pm
దొంగతనాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. నారాయణపేట పట్టణంలోని పలు కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పించారు. వేరే ఊర్లకు వెళ్తున్న సందర్భంలో ప్రజలు తమ విలువైన వస్తువులు, డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఎటిఎం, ఓటీపీ వివరాలు ఇవ్వకూడదని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు.