నూతన గదులను ప్రారంభించిన మంత్రి
NEWS Jul 13,2025 07:56 pm
అమరచింత మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతులను కల్పించడానికి తన వంతు కృషి ఉంటుందన్నారు. కానీ మీ నుండి నేను కోరుకునేది మాత్రం విద్యార్థులకు మంచి భవిష్యత్ ను అందించడమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు..