ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. తండ్రి చివరి చూపు నోచుకోని కొడుకు
NEWS Jul 13,2025 09:48 am
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి గుండెపోటుతో కోరుట్ల మండలం యూసఫ్ నగర్ కు చెందిన దుండిగాల నారాయణ చనిపోయారు. ఆయన కొడుకు రఘు ఖతార్ లో ఉంటాడు. అంత్యక్రియలకు రావడానికి డెత్ డిక్లరేషన్ తీసుకుని కుటుంబ సభ్యులు పంపియగా 11-9-2025 తేదీతో 2 నెలల తర్వాత చనిపోయినట్లు సర్టిఫికెట్ జారీ చేశారు ఆస్పత్రి సిబ్బంది. తప్పుడు తేదీని గుర్తించిన కంపెనీ రఘును ఇండియాకు పంపించేందుకు నిరాకరించింది.