రాష్ట్రాలు వేరైనా తెలుగు వారంతా ఒక్కటే..
NEWS Jul 13,2025 03:51 am
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడి పోయినా తెలుగు వారంతా ఒక్కటేనని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో ఆయన భేటీ అయ్యారు. తెలుగు ఐక్యతపై రాజకీయ గీతలు గీసే వారు చరిత్ర ముందు లొంగాల్సిందేనని అన్నారు. ఓట్ల కోసం ఫోటోల్లో గీతలు గీసి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారిని తెలుగు ప్రజలు క్షమించరన్నారు. తెలుగు భాష, సంస్కృతి, గౌరవం కోసం శాసనమండలిలో చర్చించానని అన్నారు.