విచారణకు విజయసాయిరెడ్డి డుమ్మా
NEWS Jul 12,2025 09:36 am
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డుమ్మా కొట్టారు. ఈ ఉదయం 10 గంటలకు సిట్ ముందు విచారణకు విజయసాయి హాజరుకావాల్సి ఉంది. అయితే, ఈరోజు విచారణకు తాను హాజరుకాలేనని సిట్ అధికారులకు విజయసాయి సమాచారం అందించారు. తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందువల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని... విచారణకు వచ్చే తేదీని తెలియజేస్తానని చెప్పారు.