ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్తుల భవనం
NEWS Jul 12,2025 05:02 am
ఢిల్లీలోని వెల్కమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతా మజ్దూర్ కాలనీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున నాలుగు అంతస్తుల భవనం కూలి పోయింది. ఈ ఘటనలో ముగ్గురిని రెస్క్యూ టీం కాపాడారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నారు. వారిని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు . ఈ ఘటన పట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.