కేంద్ర మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపు
NEWS Jul 12,2025 09:31 am
లోక్ జనశక్తి అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ టైగర్ మెరాజ్ ఇడిసి పేరుతో ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ విషయాన్ని ధ్రువీకరించారు పార్టీ ప్రతినిఇ రాజేశ్ భట్. ఈ పోస్ట్ పై చర్యలు తీసుకోవాలని పాట్నాలోని సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు.