పామూరు నుంచి శ్రీశైలంకు బస్సు
NEWS Jul 12,2025 08:39 am
పామూరు నుంచి శ్రీశైలంకు వెళ్లేందుకు పామూరులో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు బస్సు బయలు దేరుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు. ఈ బస్సు నెల్లూరు నుంచి కలిగిరి, వింజమూరు, పామూరు, కనిగిరి నుంచి శ్రీశైలంకు చేరుతుందని అన్నారు. అనంతరం శ్రీశైలం నుండి కనిగిరి, పామూరు, వింజమూరు కలిగిరి, నెల్లూరు మీదుగా తిరుపతికి వెళుతుందని ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.