42 శాతం రిజర్వేషన్ల అమలు చారిత్రాత్మకం
NEWS Jul 12,2025 08:32 am
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ నిర్ణయం వెనుక ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయం ఉందన్నారు. సీఎం రేవంత్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి అభినందనీయమన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లతో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందన్నారు.