వాహనదారులకు టంగుటూరు ఎస్ఐ కౌన్సిలింగ్
NEWS Jul 12,2025 09:51 am
ప్రకాశం జిల్లా టంగుటూరులో వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. లైసెన్స్, బండికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మోటార్ సైకిల్ కి సైలెన్సర్లు మారిస్తే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించవద్దని, అప్రమత్తంగా ఎస్ఐ ఉండాలని ఎస్ఐ సూచించారు.
.