ఆగస్టు 15 నుంచి మహిళలకు సీఎం చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కనిగిరిలోని కొత్తూరులో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.