కట్ట మైసమ్మతల్లికి, వెండి కిరీటం బహుకరణ
NEWS Jul 12,2025 04:20 pm
పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్, ఎల్లమ్మ చెరువు సమీపంలోని, శ్రీ కట్ట మైసమ్మ తల్లికి, వెండి కిరీటాన్ని పెద్దపల్లికి చెందిన జువెల్లరీ వ్యాపారి రంగు కవిత శ్రీనివాస్ బహుకరించారు. వెండి కిరాటాన్ని, ఆలయ పూజారి, నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు, పాలాభిషేకం చేసి, అమ్మవారికి వెండి కిరీటాన్ని అలంకరించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆషాడ మాసంలో, శ్రీ కట్ట మైసమ్మ తల్లి బోనాలు, ఉత్సాహాలు ఘనంగా జరుగుతున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు.