హమాలీల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ
NEWS Jul 11,2025 05:27 pm
దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మార్కెట్ యార్డులో హమాలి సంఘం భవన నిర్మాణం కోసం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, నిరంతరం చెమటోడ్చే కార్మికుల కష్టాలను గుర్తించి, వారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా నేడు భవన నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు, గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు.