ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం - పొన్నం
NEWS Jul 11,2025 07:11 am
తాము ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్ట బద్దత తీసుకు వస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా పాలన ప్రభుత్వంలో 19 వ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. మిగతా పార్టీలు కూడా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని మంత్రి కోరారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర సందర్భంగా సామాజిక న్యాయం చేయాలని జిత్నే అబాధి ఉత్నే ఇసేదారీ అని కుల గణన సర్వే చేశామని చెప్పారు. ఈ సర్వే దేశానికి రోల్ మోడల్ గా మారిందన్నారు.