321 అంశాలకు కేబినెట్ ఆమోదం
NEWS Jul 11,2025 07:01 am
18 కేబినెట్ సమావేశాల్లో 327 అంశాలు చర్చించామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 23 శాఖలకు చెందిన 321 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 96 శాతం అంశాలు అమలులోకి వచ్చాయన్నారు. రెండు వారాలకోసారి కేబినెట్ సమావేశం జరుగుతుందన్నారు. తిరిగి ఈనెల 25న మళ్లీ కేబినెట్ భేటీ అవుతుందన్నారు. తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే లోకల్ బాడీ ఎలక్షన్ కు వెళతామన్నారు.