జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ క్యాంటీన్లు
NEWS Jul 10,2025 08:26 pm
హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కొత్తగా ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేయనుంది. 139 ప్రాంతాల్లో రూ.11.43 కోట్లతో కంటనైనర్లు కొనుగోలు చేస్తామని, ఇందులో భోజనంతో పాటు త్వరలో రూ. 5కే అల్పహారం కూడా అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించింది.