గాజా స్ట్రిప్లో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ భద్రతా దళాలు తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. హమాస్ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులను తీవ్రతరం చేసింది.