చంద్రబాబుపై జగన్ విమర్శలు
NEWS Jul 10,2025 04:47 pm
మామిడి రైతుల సమస్యలపై నిరసన తెలుపుతున్న వారిని రౌడీషీటర్లుగా, అసాంఘిక శక్తులుగా చిత్రీకరిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయనకు మద్దతిస్తున్న ఎల్లో మీడియా సంస్థలు మరింతగా దిగజారిపోయాయంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి, ఆ మీడియాకు ఉన్న బాధ్యతారాహిత్యం, తేలికభావం ఈ వక్రీకరణలతో బయటపడిందని మండిపడ్డారు.