సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి
NEWS Jul 11,2025 06:19 am
సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతూనారాయణపేట జిల్లా వైద్య శాఖ కార్యాలయ అధికారి బిక్షపతికి ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ.. వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రతలు చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని అన్నారు.