కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
NEWS Jul 10,2025 06:23 am
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఓ చిన్నారితో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం కడప జిల్లా మైదకూరుకు స్కార్పియో వాహనంలో బయలుదేరింది. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు చేరుకోగానే, రోడ్డు పక్కన ఉన్న ట్రాక్టర్ను వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జయింది.