గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ
NEWS Jul 10,2025 06:25 am
హైదరాబాద్ గాంధీ భవన్లో చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీపై నిర్ణయం తీసుకోనున్నారు. గత వారం తనపై వచ్చిన ఆరోపణలపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు మంత్రి కొండా సురేఖ భర్త మురళి. కాగా క్రమశిక్షణ విషయంలో సీరియస్గా ఉండాలని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. వరంగల్ విషయంలో కమిటీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది