మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. ప్రజల్లో తిరిగే నైతిక హక్కు తనకు లేదన్నారు. కావాలని లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించేందుకు పర్యటిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. అధికారుల సూచనలను పట్టించు కోకుండా మొండితనంతో ముందుకు వెళ్లడం తప్పన్నారు. వైకాపా పార్టీకి ప్రజల్లో మద్దతు లేదన్నారు. జగన్ పూర్తిగా భ్రమల్లో ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. బంగారుపాళ్యంలో వైసీపీ దండుపాళ్యం పర్యటనలా ఉందన్నారు.