పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు
NEWS Jul 09,2025 03:18 pm
వెలిగండ్ల మండలం ఇమ్మడి చెరువు సచివాలయాన్ని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి గైర్హాజరు కావడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయాలా సిబ్బంది పనితీరు మార్చుకొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.