ఓవైసీ ఫాతిమా కాలేజీపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా
NEWS Jul 09,2025 11:36 am
ఒవైసీ ఫాతిమా కాలేజీపై క్లారిటీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. FTLలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్లో తొలగిస్తామని చెప్పామన్నారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోందన్నారు. ఎలాంటి ఫీజులు వసూలు చేయరని, 10 వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారని, అందుకే సామాజిక కోణంలో ఆలోచించి కూల్చలేదన్నారు. ఎంఐఎం నేతల ఆస్తుల వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.