హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం
NEWS Jul 09,2025 02:49 am
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాల దెబ్బకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. 80 మంది ప్రాణాలు కోల్పోగా 120 మంది గల్లంతయ్యారు. 150 మందికి పైగా గాయపడ్డారు. 200కు పైగా రహదారులలో వర్షాల కారణంగా రాక పోకలను నిలిపివేశారు. 8 జిల్లాలకు వరద ముంపు పొంచి ఉందని హెచ్చరించింది ప్రభుత్వం. సహాయక చర్యలు చేపట్టామని తెలిపింది.