చిరుప్రాయంలోనే ప్రపంచ రికార్డ్..
కశ్విని అభినందించిన ప్రకాశం ఎస్పీ
NEWS Jul 09,2025 08:26 am
ఒంగోలుకు చెందిన సాయికుమార్, ప్రణతి దంపతుల కుమార్తె అంబటి కశ్వి 17 నెలల చిరుప్రాయంలోనే ప్రపంచ రికార్డును సాధించింది. 24 కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. చిన్నారి కశ్విని జిల్లా ఎస్పీ దామోదర్ అభినందించారు. చిన్న వయసులోనే ప్రతిభను చాటి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో చిన్నారి మరిన్ని రికార్డులు నెలకొల్పేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు.