ఈవో రమాదేవిపై దాడి..మంత్రి సీరియస్
NEWS Jul 08,2025 02:24 pm
భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. దేవుడి భూములు రక్షించే ఈవోలపై దాడి చేస్తే ఊరుకోమన్నారు. ఎండోమెంట్ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామన్నారు. ఈవో రమాదేవికి ఫోన్ చేసి పురుషోత్తమపట్నం దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో ఈవో చికిత్స పొందుతున్నారు.