ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
NEWS Jul 08,2025 07:45 pm
ప్రకాశం జిల్లా పామూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నేషనల్ స్టూడెంట్ డే సందర్భంగా ఏబీవీపీ కన్వీనర్ బత్తల రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి జిల్లా కన్వీనర్ గురునాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి పోరాటానికైనా వెనుకడుగు వేసే ప్రకస్తేలేదని ఆయన తెలిపారు.