ఫ్రీ బస్సు పథకం జిల్లాకే పరిమితం
NEWS Jul 08,2025 06:10 pm
ఏపీ సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆయన మహిళలకు ఇస్తానన్న ఫ్రీ బస్సు పథకంలో మెలిక పెట్టారు. ఎవరైనా సరే కేవలం ఉచిత బస్సు ప్రయాణం కేవలం ఆయా జిల్లాలకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ జిల్లా దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే విధిగా టికెట్ తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ జర్నీ స్కీం అమలు చేస్తామన్నారు.