పొన్ముడి వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం
NEWS Jul 08,2025 03:32 pm
డీఎంకే మాజీ మంత్రి కె. పొన్ముడి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శైవ, వైష్ణవ సంప్రదాయాలను అవమానించే వ్యాఖ్యలు చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ వ్యాఖ్యలు హేట్ స్పీచ్గా పరిగణించి, పోలీసుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. జస్టిస్ పి. వెల్మురుగన్ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.