తెలంగాణ సీఎస్కు హైకోర్టు నోటీసులు
NEWS Jul 08,2025 08:30 am
కోర్టు ధిక్కరణ కింద తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావుకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. గ్రంథాలయ శాఖ స్వీపర్లకు పెంచిన వేతనాలు చెల్లించలేదని దాఖలైన పిటిషన్లో సీఎస్ తో పాటు , గ్రంథాలయ ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీధర్, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసా చారిలకు నోటీసులు జారీ చేసింది. తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.