ఇడుపులపాయలో తండ్రికి జగన్ నివాళి
NEWS Jul 08,2025 10:10 am
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్, వైఎస్సార్ ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు.