నేటి ముఖ్యాంశాలు
NEWS Jul 08,2025 07:51 am
▪️అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాద్కు చెందిన ఫ్యామిలీ సజీవ దహనం
▪️నేడు శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సీఎం చంద్రబాబు
▪️రెండో రోజూ ఢిల్లీలో సీఎం రేవంత్ టూర్.. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలతో భేటీ
▪️నెల్లూరుః కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి
▪️నేడు దివంగత సీఎం వైఎస్సార్ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించనున్న జగన్
▪️మహబూబ్నగర్లో నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా ఐదుగురు మంత్రుల టూర్
▪️హైదరాబాద్లో నేడు కేంద్ర హోంశాఖ సమీక్ష.. మావోలు, డ్రగ్స్ తదితర అంశాలపై చర్చ
▪️నేడు సిగాచి పరిశ్రమకు NDMA బృందం.. పేలుడుకు గల కారణాలపై అధ్యయనం
▪️నెలూరుః రొట్టెల పండుగలో భాగంగా నేడు గంథ మహోత్సవంలో పాల్గొననున్న భక్తులు
▪️విజయవాడః ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శాకాంబరి ఉత్సవాలు.. మూడ్రోజుల పాటు వీఐపీ దర్శనాలు రద్దు
▪️విశాఖః నేడు నేవీలోకి INS నిస్తార్.. జాతికి అంకితం చేయనున్న నౌకాదళం
▪️ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
▪️రష్యా మాజీ మంత్రి స్టారోవోయిట్ ఆత్మహత్య.. మంత్రి పదవి నుంచి తొలగించిన కొన్ని గంటలకే సూసైడ్
▪️భారత్, బ్రెజిల్ను భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా చేర్చాలని బ్రిక్స్ దేశాల డిమాండ్
పాకిస్తాన్ను ముంచెత్తిన వరదలు.. 72 మంది మృతి
▪️జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు విధించిన అమెరికా
▪️కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో భారీగా పతనమైన ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ షేర్లు
▪️ఐసీసీ సీఈవోగా సంజోగ్ గుప్తా నియామకం