కేంద్రమంత్రి మన్సూఖ్తో రేవంత్ భేటీ
NEWS Jul 07,2025 03:53 pm
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్, 40వ నేషనల్ గేమ్స్, ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్బంగా కోరారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరి రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని విన్నవించారు.