"సుపరిపాలనలో తొలి అడుగు"లో ఎమ్మెల్యే జనార్ధన్
NEWS Jul 07,2025 12:51 pm
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ 24, 25 డివిజన్ల పరిధిలోని బండ్లమిట్ట సెంటర్, దేవరాజు వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు.